హర్ష్ గోయంకా పోస్ట్‌పై నెట్టింట హాట్ డిబేట్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

హర్ష్ గోయంకా పోస్ట్‌పై నెట్టింట హాట్ డిబేట్‌ !


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక పోస్టులతో ఆసక్తి రేకెత్తించే ఆర్పీజీ గ్రూప్ అధిపతి హర్ష్ గోయంకా లేటెస్ట్ పోస్ట్‌తో ముందుకొచ్చారు. ఇస్రో చీఫ్ వేతన వివరాలపై ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై ప్రస్తుతం నెట్టింట హాట్ డిబేట్ సాగుతోంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాధ్ వేతనం నెలకు రూ. 2.5 లక్షలని ఆయన చేసిన ట్వీట్ చర్చకు తావిస్తోంది. ఇది సరైన నెల జీతమేనా అంటూ హర్ష్ గోయంకా ప్రజలను ప్రశ్నించడంతో పాటు సైన్స్‌, పరిశోధన అంశాలపై సోమనాధ్‌కున్న ఆసక్తిని కూడా గోయంకా ప్రస్తావించారు. ఇస్రో చీఫ్ సోమనాధ్ వేతనం నెలకు రూ. 2.5 లక్షలు. ఈ మొత్తం సరైనదేనా..? అని ప్రశ్నించారు. ఆయనలాంటి వారు డబ్బు కంటే ఇతర అంశాల స్ఫూర్తితో పనిచేస్తారని ఆయన రాసుకొచ్చారు. వారు తమ ప్యాషన్ కోసం, సైన్స్, పరిశోధనల పట్ల అంకితభావంతో పనిచేస్తారని పోస్ట్‌లో పేర్కొన్నారు. తమ లక్ష్యాల కోసం పనిచేస్తూనే దేశం కోసం జాతి గర్వించే సేవలు అందిస్తారని అన్నారు. అలాంటి అంకితభావం కలిగిన వ్యక్తులకు తాను శిరస్సు వంచి ప్రణామం చేస్తానని ట్విట్టర్‌లో గోయంకా రాసుకొచ్చారు.

No comments:

Post a Comment