మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇంఫాల్ లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పలు పోలీస్ స్టేషన్ల ముందు మహిళలు ఆందోళన చేపట్టడం తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. మణిపూర్ కు న్యాయం కావాలని మహిళల నినాదాలు చేస్తూ.. పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించారు. ఈ క్రమంలో మహిళలపై మణిపూర్ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని మహిళల డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం హింసాత్మక దాడులకు పాల్పడుతుందని మహిళలు ఆరోపించారు.
ఇంఫాల్ లో కర్ఫ్యూ విధింపు !
September 21, 2023
0
Tags