జైసల్మేర్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 September 2023

జైసల్మేర్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు


రాజస్థాన్ లోని జైసల్మేర్ లో శనివారం రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. సెప్టెంబర్ లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గత 74 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇప్పటివరకు ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. ఎడారిలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయని పేర్కొంది. ఇక బర్మేర్ లో 40.3 డిగ్రీలు, బికనేర్ లో 40 డిగ్రీలు, జోధ్ పూర్ లో 39.5 డిగ్రీలు, జైపూర్ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రానున్న నెలల్లో కూడా రాజస్థాన్ లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వెల్లడించారు.

No comments:

Post a Comment