నిరంకుశ ప్రభుత్వం పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభం !

Telugu Lo Computer
0


రేంద్ర మోడీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్‌డీయే నిరంకుశ  ప్రభుత్వం పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాంగ్రస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ముంబైలో జరుగుతున్న విపక్ష కూటమి ఇండియా భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఖర్గే ఇండియా సమైక్యంగా నిలిచింది. ఇండియా విజేతగా నిలుస్తుందని క్యాప్షన్ ఇచ్చారు. పురోగామి, సంక్షేమ, సమ్మిళిత ఇండియా కోసం తాము కలిసికట్టుగా నిలిచామని ఖర్గే రాసుకొచ్చారు. దేశంలో మార్పు అవసరమని 140 కోట్ల భారతీయులు నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ఆరంభమైందని పేర్కొన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా కలిసికట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన విపక్ష ఇండియా సమావేశంలో కీలక కమిటీలనూ ఏర్పాటు చేశారు. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించామని భేటీ అనంతరం శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్‌), శరద్ పవార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (ఎస్ఎస్‌-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్‌), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మరో సభ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో కూడిన నాలుగు ప్రధాన కమిటీలను ఈ సమావేశంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రచార కమిటీ, సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చి కమిటీలను కూడా నియమించామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)