ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మహిళను విచారణకు పిలవద్దంటూ తాను వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగా మళ్లీ ఈడీ నోటీసులెలా ఇస్తుందంటూ కవిత కోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ.. కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని, కవిత విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టుకు తెలిపింది. అయితే మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించొద్దని, గతంలో నళిని చిదంబరానికి వెసులు బాటు కల్పించారని, అదే తరహాలో కవితకు ఆదేశాలివ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 26 కు వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా..మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కవితనీ ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు విచారించింది.
Post Top Ad
adg
Friday, 15 September 2023
Home
ED
National
telangana
కవిత కోర్టులో సవాల్ చేశారు
కవిత విచారణకు రావాల్సిందే
కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
కవిత విచారణకు రావాల్సిందే !
కవిత విచారణకు రావాల్సిందే !
Tags
# ED
# National
# telangana
# కవిత కోర్టులో సవాల్ చేశారు
# కవిత విచారణకు రావాల్సిందే
# కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని
# ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
About Telugu Lo Computer
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
Tags
ED,
National,
telangana,
కవిత కోర్టులో సవాల్ చేశారు,
కవిత విచారణకు రావాల్సిందే,
కావాలంటే మరో 10 రోజుల సమయం ఇస్తామని,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment