ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 26 ఏళ్ల మహిళను ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆగస్టు 5న మామ ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం భర్తకు తెలియడంతో అతను భార్యను తీవ్రంగా కొట్టాడు. తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్నందున్న ఆమె తనకు తల్లి అవుతుందని చెబుతూ బాధితురాలిని ఇంటి నుంచి బయటకి గెంటేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు అత్తామామ, భర్తపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే మామ, కోడలి ఆరోపణలను ఖండించాడు. డబ్బుల కోసమే కోడలు నిరాధార ఆరోపణలు చేస్తూ తమపై కేసు పెట్టిందని ఆరోపించాడు.
కోడలిపై మామ అత్యాచారం
September 14, 2023
0
Tags