హిందువులు, సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి తాము వ్యతిరేకం కాదని తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ తమ పార్టీ స్వాగతిస్తుందని, అయితే స్త్రీ విద్యను వ్యతిరేకించడం, అంటరానితనం పాటించడం వంటి తిరోగమన విధానాలనే డీఎంకే వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ప్రజల మధ్య అంతరాలు ఉండరాదని, అంటరానితనాన్ని రూపుమాపాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇవన్నీ సనాతన ధర్మంలో పొందుపరచడం వల్లే వీటిని తాము వ్యతిరేకిస్తామని మంత్రి వివరణ ఇచ్చారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రగతిపధంలో ముందుకుపోతుండటంతో విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో సనాతన చర్చను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నామలై పాదయాత్ర విఫలం కావడంతో గందరగోళానికి గురై సనాతన చర్చను లేవనెత్తారని దుయ్యబట్టారు.
Post Top Ad
adg
Thursday, 14 September 2023
Home
National
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు
తిరోగమన విధానాలనే డీఎంకే వ్యతిరేకిస్తుంది
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
Tags
# National
# తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు
# తిరోగమన విధానాలనే డీఎంకే వ్యతిరేకిస్తుంది
# సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
About Telugu Lo Computer
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
Tags
National,
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు,
తిరోగమన విధానాలనే డీఎంకే వ్యతిరేకిస్తుంది,
సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి డీఎంకే వ్యతిరేకం కాదు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment