రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి నిఖిల్ మెస్వానీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి నిఖిల్ మెస్వానీ !


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ దేశ వ్యాప్తంగా అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టెలికాం నుండి రిటైల్ వరకు అన్ని రకాల వ్యాపార రంగాల్లో ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. ముఖేష్ అంబానీ జీతం ఆయన కంపెనీ ఉద్యోగుల కంటే తక్కువ. రిలయన్స్ గ్రూప్‌లోని మరో ఉన్నత స్థాయి ఉద్యోగి జీతం ఆయన జీతం కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో అత్యధిక జీతం ఆర్జించే వ్యక్తి నిఖిల్ మెస్వానీ. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగుల సంఖ్య 2 లక్షల 30 వేలు. అందరిలోకీ నిఖిల్ మెస్వానీ దే అత్యధిక పారితోషికం. నిఖిల్ మెస్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ మేస్వానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మేనల్లుడు. అతను పెట్రోకెమికల్ వ్యాపారానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఐఎల్ పెట్రోకెమికల్ బిజినెస్ హెడ్ నిఖిల్ మెస్వానీ ప్రస్తుతం వార్షిక వేతనం రూ.24 కోట్లు. ఇది ఆర్‌ఐఎల్ చైర్మన్ జీతం కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. 

No comments:

Post a Comment