ఆనంద్ మహీంద్రా నిర్ణయంతో కెనడాకు పెద్ద దెబ్బ !

Telugu Lo Computer
0


హీంద్రా అండ్ మహీంద్రా తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది. ఇది కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేయడానికి దరఖాస్తు చేసింది. ఈ నిర్ణయం తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో సెప్టెంబర్ 20, 2023న కార్యకలాపాలను మూసివేయడానికి అవసరమైన పత్రాలను కార్పొరేషన్ కెనడా నుంచి అనుమతి కోసం రెసన్ స్వీకరించిందని తెలుస్తోంది. అలాగే దాని సమాచారం కంపెనీకి తెలియజేసింది. దీంతో రేసన్ తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ వార్తల తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లలో భారీ పతనం జరిగింది. మార్కెట్ ముగియడానికి 10 నిమిషాల ముందు మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు 3 శాతం క్షీణతతో రూ.1584 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు మూడున్నర శాతం పతనమై రూ.1575.75 దిగువ స్థాయికి చేరాయి. కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.1634.05 వద్ద ముగిశాయి. మరోవైపు కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్‌లో రూ.7200 కోట్లకు పైగా క్షీణత నమోదైంది. దీంతో మహీంద్రాకు భారీ నష్టమే వాటిల్లిందని చెప్పాలి. డేటా వివరాల ప్రకారం, ఒక రోజు క్రితం కంపెనీ షేరు రూ.1634.05 గా ఉంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,03,025.78 కోట్లుగా ఉంది. కాగా, ఈరోజు కంపెనీ షేర్లు రోజు కనిష్ట స్థాయి రూ.1575.75 కి చేరినప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,95,782.18 కోట్లకు చేరింది. అటువంటి పరిస్థితిలో కంపెనీ వాల్యుయేషన్ రూ.7,243.6 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)