సెల్ఫీ పిచ్చి ప్రాణానికి ముప్పు తెచ్చింది !

Telugu Lo Computer
0


త్తరఖండ్ లో కేదారినాథ్ యాత్ర కొనసాగుతుంది. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో మందాకినీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఓ యువకుడు నదిలో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఫోటో తీసుకుంటూ ఉండగా నదిలో జారి పడి కొట్టుకుపోయాడు. అయితే లక్ బాగుండటంతో ఆ యువకుడు అక్కడ కొన్ని బండరాళ్లను పట్టుకోగలిగాడు. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ అక్కడ ఉన్న అతడిని కొంతమంది స్థానికులు గమనించి సాయం చేశాడు. ఎట్టకేలకు అతడు బతికిబట్టకట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని పొలిటికల్ క్రిటిక్ అనే యూజర్ ఎక్స్( ట్విటర్) లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్స్ ప్రాణాల కంటే సెల్ఫీ మోజు ఎక్కువయిపోయిందంటూ తిట్టిపోస్తున్నారు. ఇది చూసిన వారైనా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలని పలువురు యూజర్లు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)