ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం

Telugu Lo Computer
0


పంజాబ్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఉందనే హెచ్చరికల పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాంగ్‌స్టర్ల నెట్‌ వర్క్‌ను ఛేదించేందుకు పంజాబ్‌ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు చర్యలు ముమ్మరం చేశాయి. కెనడా ఎపిసోడ్‌ తర్వాత పంజాబ్‌లో పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు, వారి సహాయకుల రహస్య స్థావరాలపై దాడులు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్‌లో పంజాబ్ పోలీసులతో పాటు, ఎన్‌ఐఏ సహా కేంద్ర ఏజెన్సీలు పాల్గొంటున్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన పలు కీలకపాత్రలు సైతం లభ్యమయ్యాయి. దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకొని యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) వారిని విచారిస్తోంది. గత 48 గంటల్లో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, అతని సహాయకులు, గ్యాంగ్‌స్టర్లు రహస్య స్థావాలపై దాడులు జరిపారు. విదేశాల్లో దాక్కు ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లు ఏదో విధంగా సహాయం అందిస్తున్నారు. అలాంటి వారి రికార్డులను పోలీసులు సేకరించారు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కెనడా నుంచి తన నెట్‌వర్క్‌ని నడుపుతున్నాడు. కరోనా సమయంలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లకు సోషల్‌ మీడియా ద్వారా పంజాబ్‌ యువతను మచ్చిక చేసుకొని వారిని తన నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెనడాలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు మైనర్లు, కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను నమ్మించి మోసం చేస్తున్నారు. కొంత మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసి  వారిని పావులుగా వాడుకుంటూ పంజాబ్‌లో వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పిజి)తో టార్న్ తరణ్ సర్హాలి పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఉగ్రకోణం బయటపడింది. పదిమంది మైనర్లతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డట్లుగా గుర్తించారు. ప్రస్తుతం విదేశాల్లో నక్కిన ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కెనడా, భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొని ఉన్న నేపథ్యంలో విదేశాల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉచ్చు బిగిస్తున్నది. కెనడా, యూకే, అమెరికా, దుబాయిలలో తలదాచుకున్న 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశారు. పాత కేసుల్లోనూ వారి ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఎన్‌ఐఏ బృందాలను కేసులను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. సమాచారం మేరకు.. ఈ జాబితాలో పేర్లున్న వ్యక్తులందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పరంజీత్ సింగ్ పమ్మా, వాధావా సింగ్ బబ్బర్ అలియాస్ చాచా, కుల్వంత్ సింగ్, జేఎస్ ధలీవాల్, సుఖ్‌పాల్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ రాణా, సరబ్‌జిత్ సింగ్, కుల్వంత్ సింగ్ అలియాస్ కాంత, హర్జాప్ సింగ్ అలియాస్ జప్పీ సింగ్, రంజీత్ సింగ్ నీతా, అలీ గుర్మీత్ పరారీలో ఉన్నవారి జాబితాలో ఉన్నారు. అలియాస్ బాబా, గురుప్రీత్ సింగ్ అలియాస్ బాగీ, జస్మీత్ సింగ్ హకీంజాదా, గుర్జంత్ సింగ్ ధిల్లాన్, లఖ్‌బీర్ సింగ్ రోడ్, అమర్‌దీప్ సింగ్ పూరేవాల్, జతీందర్ సింగ్ గ్రేవాల్, దపిందర్‌జిత్, ఎస్ హిమ్మత్ సింగ్ పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)