బాలుడిపై దాబా యజమాని లైంగిక దాడి !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో బాలుడిపై దాబా యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు. పేదరికం, ఆకలితో బాధపడిన 13 ఏళ్ల బాలుడు తన గ్రామాన్ని విడిచి పట్టణానికి చేరుకున్నాడు. రాజేష్‌ అనే వ్యక్తికి చెందిన రాథోర్‌ దాబాలో పని చేస్తున్నాడు. అయితే గత మూడు రోజులుగా రాజేష్‌ రాత్రివేళ ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని అతడ్ని బెదిరించాడు. కాగా, ఈ ఆరాచకాన్ని భరించలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి దాబా యజమాని రాజేష్‌పై ఫిర్యాదు చేశాడు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దాబా యజమాని రాజేష్‌ కోసం వెతుకుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)