అన్నిమతాలను గౌరవించాలి !

Telugu Lo Computer
0


డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం' పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రజలు అన్నిమతాలను గౌరవించాలని కోరారు. 'నేనూ సనాతన ధర్మానికి చెందిన వాడిని. మనలో చాలా మంది సనాతన ధర్మానికి చెందిన వారే. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి. దానికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడకూడదు' అని వ్యాఖ్యానించారు. ఇలా ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసినప్పటికీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి ఇప్పటికే స్పష్టం చేశారు. తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)