జీ20 ప్రకటన భారత దౌత్య నైపుణ్యానికి నిదర్శనం !

Telugu Lo Computer
0


జీ20 శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలు సమష్టిగా ఉమ్మడి ప్రకటన జారీ చేయడం భారత దౌత్య నైపుణ్యానికి, ప్రధాని మోడీ నేర్పరితనానికి నిదర్శనమని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు. ''జీ20 శిఖరాగ్రసదస్సు సాధించిన అద్భుత ఫలితాలపై ముందుగా భారత ప్రజలను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది భారత దౌత్య నైపుణ్యానికి, ప్రధాని మోడీ నేర్పరితనానికి సాక్ష్యం. మోడీ, ఆయన బృందం  జీ20 సభ్యులందరినీ ఐక్యంగా ఉంచి బలమైన ఉమ్మడి ప్రకటన జారీ చేయగలిగారు'' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)