కూరగాయల వ్యాపారితో కలిసి రాహుల్ భోజనం !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి అనూహ్యంగా ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ఈ యాత్ర ద్వారా రాహుల్ ప్రజలకు మరింత చేరువయ్యారు. మరీ ముఖ్యంగా కార్మికులకు చేరువవుతున్నారు. లారీ డ్రైవర్ల సమస్యలని తెలుసుకునేందుకు రాహుల్ స్వయంగా లారీ నడిపాడు. వందలాది కిలోమీటర్లు రాహుల్ లారీ నడుపుతూ కనిపించాడు. అలాగే బైక్ మెకానిక్ షెడ్డుకి వెళ్లి నట్లు బిగించాడు. హోటల్ లో సామాన్యులతో బ్రేక్ ఫాస్ట్ చేయడం ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. తాజాగా రాహుల్ ఓ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ రావుతో కలిసి భోజనం చేశారు. స్వయంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆ వ్యాపారితో ముచ్చటించారు. దీనికి సంబంధిని ఫోటోని రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)