'అమృత్ కలశ్ డిపాజిట్' పథకం గడువును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వచ్చిన ఈ పథకం గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం తుది గడువు ఆగస్ట్ 15 ముగియాల్సి ఉంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్వల్పకాలిక మదుపు దారులకు ఇది అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డిపాజిట్ను ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. అలాగే రుణాలను కూడా పొందవచ్చు.