ఈరోజు ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోడీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 'తనకంటే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై మోదీ చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్కు విరుద్ధంగా వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదం. చంద్రయాన్-1 విజయం వేళ.. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు సీఎంగా ఉన్న మోదీ.. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్కు వెళ్లారు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. దీనిపై మోడీ నుంచి స్పష్టత వచ్చింది. బెంగళూరులోని హాల్ ఎయిర్పోర్టు వెలుపల ప్రధాని మాట్లాడుతూ వారిని రావొద్దనడానికి కారణం చెప్పారు. 'బెంగళూరుకు నేను ఏ సమయంలో చేరుకుంటానో కచ్చితంగా తెలీదు. అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. అందుకే వారిని రావొద్దని చెప్పాను' అని మోడీ వెల్లడించారు.
నేనే సీఎంని రావొద్దని చెప్పా !
August 26, 2023
0
Tags