ఆవు దాడి చేసిన కేసులో యజమాని అరెస్టు !

Telugu Lo Computer
0

                                               

చెన్నైలో ఓ స్కూల్ విద్యార్థినిపై ఆవు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ పోలీసులు ఆ ఆవు యజమానిని అరెస్టు చేసి, రెండు వేల ఫైన్ వేశారు. 9 ఏళ్ల అయేషా అనే అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోడ్డుపై ఓ ఆవు తిరగబడి ఆ అమ్మాయిని అటాక్ చేసింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమీప ఇంట్లో ఉన్న సీసీటీవీకి ఆ దృశ్యాలు చిక్కాయి. ఆ ఆవు తన కొమ్ములతో విద్యార్థిని పైకి ఎత్తేసి కింద పడేసింది. ఆ అమ్మాయి అరుపులతో పాటు ఆమె తల్లి కూడా అరవడంతో.. స్థానికులు అక్కడకి చేరుకున్నారు. రాళ్లు రువ్వి ఆ ఆవును తరిమే ప్రయత్నం చేశారు. కానీ చాలా సేపు ఆ ఆవు .. కింద పడిపోయిన ఆ విద్యార్థినిపై అటాక్ చేస్తూనే ఉండిపోయింది. అయితే ఓ వ్యక్తి కర్రతో కొట్టిన తర్వాత ఆ ఆవు అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి  సుబ్రమణియన్ ఆ హాస్పిటల్‌ని సందర్శించి విద్యార్థిని పరామర్శించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)