తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారధ్యంలో ఎన్నికల కమిషనర్లు, అధికారులు పర్యటిస్తారు. ఈ నెలాఖరులో మిజోరంలో పర్యటిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పర్యటించి ఏర్పాట్లను సమీక్షిస్తారు. వచ్చే అక్టోబర్-నవంబర్లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ 17తో మిజోరం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలోని వివిధ తేదీలతో గడువు ముగుస్తుంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్లో బీజేపీ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.
Post Top Ad
adg
Tuesday, 22 August 2023
Home
24న ఛత్తీస్గఢ్లో ఈసీ పర్యటన !
National
New Delhi
ఏర్పాట్లను సమీక్షిస్తారు
రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు
24న ఛత్తీస్గఢ్లో ఈసీ పర్యటన !
24న ఛత్తీస్గఢ్లో ఈసీ పర్యటన !
Tags
# 24న ఛత్తీస్గఢ్లో ఈసీ పర్యటన !
# National
# New Delhi
# ఏర్పాట్లను సమీక్షిస్తారు
# రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు
About Telugu Lo Computer
రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు
Tags
24న ఛత్తీస్గఢ్లో ఈసీ పర్యటన !,
National,
New Delhi,
ఏర్పాట్లను సమీక్షిస్తారు,
రెండు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment