అంజూకు భూమి, నగదు కానుకగా ఇచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీఈవో ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 31 July 2023

అంజూకు భూమి, నగదు కానుకగా ఇచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీఈవో !


పాకిస్థాన్‌ ప్రియుడిని వివాహమాడేందుకు ఇస్లాంలోకి మారిన భారతీయ మహిళ అంజూ (34)కు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కానుకలు అందించారు. సుమారు 2,722 చదరపు అడుగుల భూమికి సంబంధించిన పత్రాలతోపాటు ఓ చెక్కును ఆమెకు అందజేశారు. 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్న అంజూ ఇటీవల రాజస్థాన్‌ నుంచి పాక్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా(29)ను ఆమె ఈ నెల 25న పెళ్లి చేసుకుంది. వివాహం కోసం ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీఈవో అయిన మోసిన్‌ ఖాన్‌ అబ్బాసి వారి ఇంటికి వెళ్లి  అంజూకు భూమి పత్రాలతో పాటు ఓ చెక్కును అందజేశారు. అయితే ఎంత మొత్తానికి ఆ చెక్కు ఇచ్చారన్నది తెలియరాలేదు. ''అంజూ భారత్‌ నుంచి ఇంత దూరం వచ్చి ఇస్లాంలోకి మారి నూతన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఆమెను మా మతంలోకి ఆహ్వానించడంతోపాటు దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను. ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమెకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే కానుకలు ఇచ్చాను'' అని అబ్బాసి చెప్పారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment