తొలి వన్డేలో విండీస్​పై ఇండియా గెలుపు

Telugu Lo Computer
0


వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను రోహిత్​ సేన మట్టికరిపించింది. విండీస్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 52 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్​ యాదవ్​(19), రవీంద్ర జడేజా(16) రోహిత్​ శర్మ(12)తో ఈ మ్యాచ్​లో రాణించాడు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇక టీమ్​ఇండియా బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (4/6), జడేజా (3/37) ప్రత్యర్థులకు చుక్కలు చూపించగా.. విండీస్​ ప్లేయర్లలో షై హోప్‌(43) టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)