తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లు ఆపాలంటూ ఎన్నోరోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న డిమాండ్ల పై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. తెలంగాణలోని బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్నగర్, మహబూబ్నగర్, షాద్నగర్, గద్వాల్ స్టేషన్లలో పలు రైళ్లను ఆపనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు వెల్లడించింది. తెలుగు ప్రజల డిమాండ్లను ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. ఇందుకు అనుగుణంగా రైల్వే అధికారులతో చర్చించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధాన రైళ్లను ఆపాలని ఆదేశాలిచ్చారు. త్వరలో రైళ్ల హాల్టింగ్స్, వాటి అనుగుణంగా మారే టైం టేబుల్ వెల్లడికానుంది. రైల్వే నిర్ణయంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. https://t.me/offerbazaramzon
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్న రైళ్లు !
July 19, 2023
0
Tags