ఏటీఎంలో ఏసీ చోరీ !

Telugu Lo Computer
0


పం
జాబ్​లోని మోగా జిల్లాలోని బాఘ్​ పట్టణంలో ఉన్న ఎస్​బీఐ ఏటీఎంలో ఏసీ ని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులో ఒకడు అక్కడే డస్ట్​ బిన్​ను తిరుగవేసి పైకి ఎక్కి ఇండోర్​ ఏసీ యూనిట్​ వైర్​లను కత్తిరించేశాడు. ఆ తర్వాత  ఏసీ మెషిన్​ను ఇద్దరు కలిసి తీసుకెళ్లారు. చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. గతంలో కూడా బ్యాంకుకు చెందిన మోటారు సైకిల్ కూడా చోరీకి గురైన సమయంలోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)