యువతి వెనుక నుంచి వచ్చి యువకుని దాడి !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాసన్‌ కుమార్తె గుమ్మిడిపూండిలోని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. గురువారం సాయంత్రం యథావిధిగా కళాశాల ముగించుకుని బస్సులో ఇంటికి బయలుదేరింది. గుమ్మిడిపూండిలోని పెరియార్‌ బస్టాండ్‌ వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లే క్రమంలో కమ్మవారిపాళ్యం గ్రామానికి చెందిన రఘుపతి కుమారుడు అన్బు(21) వెనుక వచ్చి హఠాత్తుగా యువతిపై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనపై యువతి తల్లి గుమ్మిడిపూండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)