మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడి భార్య అయిన ఇబేటోంబి (80)ని దుండగులు సజీవంగా తగులబెట్టారు. మే 28న ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త చురాచంద్ సింగ్ స్వాతంత్య్ర సమరయోధుడు. తన 80వ ఏట మరణించారు. దుండుగులు సెరౌ గ్రామంపై దాడిచేయడంతో.. వెంటనే పారిపోండని తమ కుటుంబసభ్యులకు ఇబేటోంబి సూచించింది. వయోభారంతో తాను ఇంటిలోనే నిలిచిపోయింది. ఆమె ఇంటికి బయటి నుంచి తాళం వేసిన దుండగులు అనంతరం నిప్పుపెట్టారు. ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు వచ్చేసరికే ఇల్లు మొత్తం బూడిదైంది. ఆమె మనవడు ప్రేమ్కంఠకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తన బామ్మను రక్షించే ప్రయత్నంలో అతడికి బుల్లెట్ గాయాలయ్యాయి. https://t.me/offerbazaramzon
మణిపూర్లో స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం !
July 22, 2023
0
Tags