10 ఏళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్ట్ చేయించి, బెయిల్ ఇప్పించింది !

Telugu Lo Computer
0


గుజరాత్ కి చెందిన ఓ మహిళ గృహహింస కింద భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పిస్తూ వస్తోంది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 10 ఏళ్లలో తన భర్తను 7 సార్లు అరెస్ట్ చేయింది. మెహసానా జిల్లాలోని కడి పట్టణంలో ప్రేమ్‌చంద్ మాలి మరియు అతని భార్య సోను దంపతులు  నివసిస్తున్నారు. 2001లో వీరిద్దరికి వివాహం జరిగింది. 2014 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2015లో మొదటిసారిగా సోనూ తన భర్త ప్రేమ్ చంద్ భౌతిక దాడికి పాల్పడినందుకు కేస్ పెట్టింది. ఇదే తొలి కేసు. ఆమెకు నెలవారీగా రూ. 2000 భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే రోజూవారీ కూలీకి వెళ్లే ప్రేమ్ చంద్ భరణం చెల్లించకపోవడంతో మరోసారి అరెస్ట్ చేశారు. ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత, భార్య సోనూనే తన భర్త కోసం బెయిల్ రెడీ చేసింది. వీరిద్దరు విడివిడిగా జీవితం ప్రారంభించినప్పటికీ, వారి మధ్య సయోధ్య కుదర్చడం, మళ్లీ గొడవలు రావడం పరిపాటిగా మారింది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు మళ్లీ ఒకటిగా జీవించడం ప్రారంభించారు. ఆ తరువాత కూడా గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రేమ్ చంద్ పై 2016 నుంచి 2018 వరకు సోనూ నుంచి ఫిర్యాదులు రావడం, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. కానీ ప్రతీసారి అరెస్ట్ చేయించి భార్య సోనూనే అతడికి బెయిల్ ఇస్తూ వచ్చేది. ప్రేమ్ చంద్ 2019, 2020లో కూడా జైలు పాలయ్యాడు. మళ్లీ సోనూనే రక్షించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా భరణం చెల్లించని కారణంగా ప్రేమ్ చంద్ అరెస్ట్ అయ్యాడు. జూలై 4న విడుదలయ్యాడు. ఇటీవల విడులైన సమయంలో ప్రేమ్ చంద్ పర్సు, మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఆ తరువాత మళ్లీ సోనూతో గొడవ జరిగింది. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు చేయిజేసుకున్నారు. ప్రేమ్ చంద్ చివరకు ఇంటిని విడిచిపెట్టి పటాన్ లోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయాడు. సోనూ, తన కొడుకు తనకు హాని చేస్తారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)