చున్నీని పీకకు చుట్టి తల్లిని హతమార్చిన కూతురు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన సేనాలి సేన్ కుటుంబం ఆగ్నేయ బెంగళూరులో మైకో లే అవుట్ పరిధిలోని బైలేక హళ్లిలో అపార్ట్ మెంట్‌లో నివస్తోంది. సేనాలి ఫిజియో థెరపిస్ట్. ఆమె ఆ ఇంట్లో భర్త, అత్త, అమ్మ, ఓ కుమారుడితో జీవిస్తుంది. అయితే సోనాలి తల్లి బీవా పాల్ తరచూ ఇంట్లో గొడవపడుతూ ఉండేది. తన అత్త , అమ్మ మధ్య జరిగే గొడవలతో కూతురు విసిగిపోయింది. అలాగే సోమవారం కూడా తన అత్తతో తల్లి గొడవ పడింది. ఈ క్రమంలో తల్లిని మందలించింది కూతురు. దీంతో ఆమె తల్లి బీవా పాల్  చనిపోతానంటూ బెదిరించడం మొదలు పెట్టింది. నిద్ర మాత్రలు మింగి చచ్చిపోతానంటూ చెప్పడంతో  అప్పటికే తల్లి గొడవలతో విసిగిపోయిన కూతురు సేనాలి, కోపంతో మింగేయాలంటూ బలవంతం చేసి, మింగించింది. తల్లికి కడుపులో తిప్పడంతో పాటు, అనారోగ్యానికి గురి కావడంతో తన చున్నీతో తల్లి పీకకు చుట్టి హతమార్చింది. అనంతరం ఆ శవాన్ని సూట్ కేసులో కుక్కి, అందులో తండ్రి ఫోటోను పెట్టి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)