ధన్‌బాద్‌ బొగ్గు గనిలో పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ లోని ధన్‌బాద్‌ బొగ్గు గనిలో సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బొగ్గును వెలికితీసేందుకు వందలాది మంది కార్మికులు సొరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు. ఏటీదేవ్‌ ప్రభ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలో అక్రమ మైనింగ్‌ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)