టీడీపీ సీనియర్‌ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణకు చెందిన మరో సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దయాకర్‌రెడ్డి మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దయాకర్‌రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున రెండు సార్లు అమరచింత, ఒకసారి మక్తల్ నుంచి గెలుపొందారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ కనుమరుగైనప్పటికి ఆయన వేరే పార్టీల్లో చేరకుండా టీడీపీలోనే ఉండిపోయారు. దయాకర్‌రెడ్డి సతీమణి సైతం టీడీపీలో క్రియాశీల నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మరణవార్తపై ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఇతర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉన్న దయాకర్‌రెడ్డి లాంటి నేతను కోల్పోవడం నిజంగా టీడీపీకి తీరని లోటని కొనియాడారు. దయాకర్‌రెడ్డికి మృతికి శ్రద్దాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)