హోల్ సెల్ అవినీతికి ప్రత్యక్షంగా పాత్ర వహించింది మీరు !

Telugu Lo Computer
0


దేశాన్ని ముక్కలు చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి సెంటిమెంట్లను రెచ్చగొడుతూ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు అధికారంలోకి వచ్చాక మీ దత్తపుత్రులు ఎంత దోచుకుతున్నారో లెక్క తీయండి. అందులో మీ ప్రథమ పుత్రుడు అదాని. మీరు అధికారంలోకి వచ్చాక లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వారు ఉన్నారు. మీరు ఇక్కడే ఉండి పెద్ద దత్తపుత్రుడు దేశ సంపద దోచుకుంటుంటే మీరంతా సహకరిస్తున్నారు. 9 ఏళ్ళల్లో మీ దత్తపుత్రుల దోచుకున్న లెక్కలు చూస్తే ప్రాంతీయ పార్టీలది ఏమీ కనిపించదు. హోల్ సెల్ అవినీతికి ప్రత్యక్షంగా పాత్ర వహించింది మీరే. నేర పూరిత సమాజానికి అండగా నిలుస్తున్నది మీ హోంమంత్రే. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న మీరా ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడేది? అవినీతి లెక్కలు తీయండి. మీ దత్తపుత్రుడు ఎంత తిన్నాడు.. మిగతవాళ్ళు ఎంత తిన్నారో తేలిపోతుంది' అని నారాయణ డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)