వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి

Telugu Lo Computer
0


మహారాష్ట్రకు చెందిన విట్టు షలాకే అనే 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం రాంనగర్ నుంచి తింబోలి గ్రామానికి అటవీ మార్గంలో వెళుతుండగా అతనిపైకి ఎలుగుబంటి దాడి చేసింది. ఆ వృద్ధుడి ఒక కన్నును పెరికివేసింది. ఆ వృద్ధుడు బిగ్గరగా అరుస్తూ పెడబొబ్బలు పెట్టడంతో ఆ ఎలుగుబంటి అతడిని వదిలివేసి అడవిలోకి పారిపోయింది. తీవ్ర రక్తగాయాలపాలైన ఆ వృద్ధుడు అలాగే దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామంలోకి చేరుకున్నాడు. రక్తమోడుతున్న షెలాకేను వెంటనే గ్రామస్తులు రాంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం అతడిని బెలగావిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో నివసించే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎలుగుబంటి దాడి నుంచి గ్రామస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)