27న సైయెంట్‌ డీఎల్‌ఎం ఐపీవో

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ ఆధారిత సంస్థ, హై-ఎండ్‌ ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సైయెంట్‌ డీఎల్‌ఎం లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్‌ ధరల శ్రేణిని రూ.250-265గా నిర్ణయించారు. నాలుగు రోజులపాటు సబ్‌స్క్రిప్షన్‌కు వీలుండే ఈ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ముగుస్తుంది. కాగా, 26న యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ మొదలవుతుందని ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఈ ఇష్యూ విజయవంతమైతే రూ.700 కోట్ల నిధులు కంపెనీకి రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)