అనారోగ్యంతో అస్వస్థత గురైన భవన నిర్మాణ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు సాయం !

Telugu Lo Computer
0


మిళనాడు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉంటూ అనారోగ్యంతో అస్వస్థతకు గురై పనులకు వెళ్లలేని కార్మికులకు యేడాదికి రూ.12 వేలు చొప్పున మూడేళ్ల వరకూ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకుని, 60 యేళ్లలోపున్న కార్మికుల జీవనాధారం, ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా హృద్రోగ శస్త్రచికిత్స, మూతపిండాల మార్పిడి చికిత్స, డయాలసిస్‌, క్యాన్సర్‌, పక్షవాతం తదితర వ్యాధులకు గురై పనులకు వెళ్లలేక చికిత్స పొందుతున్న కార్మికులు ఈ సాయం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)