నిన్న పెళ్లి - మరుసటిరోజే బిడ్డకు జననం !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన వ్యక్తికి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 26 సోమవారం రోజున సికింద్రాబాద్‌లో పెళ్లి ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు అత్తగారింటికి వెళ్లారు. ఆ తర్వాతి రోజు మంగళవారం వధువుకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. ఆమె గర్భవతి అని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా నోరెళ్లబెట్టారు. ఆమె అప్పటికే ఏడు నెలల గర్భవతి అని చెప్పారు.  వధువు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గర్భవతి అన్న విషయాన్ని దాచి పెట్టి అమ్మాయి కుటుంబం పెళ్లి పెళ్లి చేశారు. దాని గురించి అడిగితే అమ్మాయికి రాళ్లు తీశారు అందుకే ఉందని బుకాయించారు. అయితే నవ వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు సికింద్రాబాద్‌ నుంచి గ్రేటర్ నోయిడాకు చేరుకున్నారు. ఈ ఘటనపై రెండు కుటుంబాలు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే వరుడు అతని తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను అంగీకరించకపోవడంతో శిశువును, నవ వధువును.. వారి కుటుంబం తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)