చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ''ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్ని. చనిపోయేంత వరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను'' అన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా 'మిథునం' చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన 'అమ్మే దైవం' పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్.
ఇక నటనకే అంకితం అవుతాను !
May 14, 2023
0
Tags