జార్ఖండ్ లోని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే వారు స్థానికంగా ఇళ్లల్లో, షాపుల్లో దొంగతనాలు చేస్తుంటారు. అలానే ఒంటరిగా ఉండే మహిళ, ఆడపిల్లల వద్ద విలువైన వస్తువులు చోరీ చేసే వారు. ఇటీవలే రాంచీ సమీపంలోని దిబ్దిహ్ వంతెన వద్ద రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో బైక్ మీద పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చోరీ చేసిన బంగారు గొలుసును సల్మాన్ మింగేశాడు. కాసేపటికి అతడు స్పహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అతణ్ని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి పరీక్షించి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. గొలుసు ఎక్కువసేపు అలాగే ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో తనను కాపాడాలని సల్మాన్ పోలీసులను వేడుకొంటున్నాడు.
పోలీసులు పట్టుకుంటారని గొలుసు మింగేశాడు !
May 29, 2023
0
Tags