ప్రాణ భయంతో ఆలయంలో గడియ పెట్టుకున్న ప్రేమికులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం, బుద్దాలపాలెం రామాలయంలో పెళ్ళి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు గడియ పెట్టుకుని ఆలయంలోనే ఉండిపోయారు. కులాంతర వివాహం చేసుకొని పెద్దలకు భయపడుతూ గుడికి పరిమితమయ్యారని స్థానికులు తెలిపారు. తల్లితండ్రులు వారి ప్రేమను అంగీకరించరని, ఏదైనా చేస్తారని భయంతో ప్రేమ జంట గుడిలోంచి బయటకురాలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత భయంతో ప్రేమికులు పోలీసులకు ఫోన్ చేశారు. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ వారు పోలీసు రక్షణ కోరారు. ప్రేమికుల విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేమికులతో మాట్లాడారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ప్రేమ జంట బయటకు వచ్చారు. ప్రేమికులిద్దరూ సచివాలయ ఉద్యోగులని.. కులాంతర వివాహం చేసుకుని.. ఆ తర్వాత భయంతో గుడిలో గడి పెట్టుకుని ఉండిపోయారని పోలీసులు తెలిపారు. వారికి రక్షణ కల్పిస్తామని, ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ సైతం ఇస్తామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)