అవగాహనారాహిత్య రాతలు : అరిందమ్ బాగ్చి

Telugu Lo Computer
0


దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయంటూ భారత్‌ లోని మత స్వేచ్ఛను విమర్శిస్తూ అమెరికా ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది పూర్తిగా పక్షపాత, ప్రేరేపిత నివేదిక అని తీవ్రంగా ఆక్షేపించింది. తప్పుదోవ పట్టించే సమాచారం, అవగాహనలేమి వల్ల అటువంటి నివేదికలు వస్తూనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ఈ వార్షిక నివేదికను వెలువరించింది. ఇందులో మత స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, భారత్, సౌదీ అరేబియా, చైనా వంటి పలు దేశాలను ఆ నివేదికలో ప్రస్తావించింది. దీనిని భారత్‌ ఖండించింది. 'అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదిక గురించి మాకు తెలిసింది. తప్పుడు సమాచారం, అవగాహన లేమితో ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరం. కొందరు యూఎస్ అధికారుల నోటి నుంచి వచ్చే ప్రేరేపిత, పక్షపాత వ్యాఖ్యానాలు.. నివేదికలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. యూఎస్‌తో ఉన్న మా భాగస్వామ్యానికి మేం విలువ ఇస్తాం. అలాగే భారత్‌ను ఇబ్బందిపెట్టే అంశాలపై స్పష్టమైన వైఖరిని వెల్లడిచేస్తాం' అని మీడియా ప్రశ్నలకు బాగ్చి సమాధానమిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)