నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రాన్ని జూన్ నాలుగోతేదీన తాకుతాయని అంచనా వేస్తున్నారు. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండురోజులు తెలంగాణలోని దక్షిణ, తూర్పు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి.
నైరుతి రుతుపవనాలు అండమాన్ లో ప్రవేశం !
May 20, 2023
0
Tags