తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం 86.60 శాతంగా నమోదైందని తెలిపారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68 గా నమోదైందని వెల్లడించారు. పది ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. కాగా, 2793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూల్స్లో ఉత్తీర్ణత శాతం 'సున్నా' గా నమోదు.. అంటే ఒక్కరూ కూడా పాస్ కాలేదు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణత సాధించగా, వికారాబాద్ జిల్లాలో అత్పల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పదో తరగతి ఫలితాలు విడుదల
May 10, 2023
0
Tags