ఢిల్లీలోని ఓ బస్స్టాప్లో వేచిచూస్తోన్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ఓ బస్సు డ్రైవర్ తీరుపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలను గమనిస్తే.. ముగ్గురు మహిళలు ఓ బస్ స్టాప్లో వేచి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన డ్రైవర్, అక్కడ బస్సు వెనుక పరుగులు పెడుతున్న మహిళల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆ వెంటనే ఆ డ్రైవర్ను గుర్తించి సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ట్విటర్లో షేర్ చేశారు. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడంలేదని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళా ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిన బస్సు డ్రైవర్ సస్పెండ్ !
May 19, 2023
0
Tags