తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలి !

Telugu Lo Computer
0


సికింద్రాబాద్‌లో జరుగుతున్న ఎన్టీఆర్  శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ నేత, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులకు మించినది ఏమి లేదు. కారణ జన్ముడు, నా గురువు, నా తండ్రి  ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తాను అతిథిని కాదని, టీడీపీ కార్యకర్తనని, టీడీపీ మనది అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలి. దాని కోసం కృషి చేస్తానంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుందని, అండగా నేనుంటా, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలని బాలకృష్ణ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ఎన్టీఆర్ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఆయన పథకాలే ప్రవేశ పెట్టారంటూ పేర్కొన్నారు. తొలిసారి దేశంలోనే పక్కా ఇల్లు ఇచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. జోగిని వ్యవస్థ రద్దు చేసింది, ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు పెట్టింది ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. దేశం మొత్తం ఆయన పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు. వేరే వేరే పార్టీల్లో ఉన్న వారికి ఆయన పెట్టిన బిక్షే పదవులు అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం విషయం మరోమారు తెర మీదకు వచ్చింది. మళ్లీ మళ్లీ చెబుతున్నానంటూ టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చి తీరాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడికి దేశం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)