సుస్థిర సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమైంది

Telugu Lo Computer
0


ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందనీ, ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను ఈ అసమాన మద్దతుతోనే నెరవేర్చగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనను శుక్రవారంతో పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న సందేశాలపై శనివారం ఆయన స్పందించారు. ''2014 నుంచి ప్రభుత్వం సాధిస్తూ వస్తున్న విజయాలపై అనేక ట్వీట్లు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. అలాంటి అభిమానపూర్వక సందేశాలను సవినయంగా స్వీకరిస్తున్నాను. 140 కోట్లమంది ప్రజలకోసం మరింతగా కష్టపడి పనిచేసేందుకు కావాల్సిన అదనపు బలాన్ని ఇవి అందిస్తాయి. గత తొమ్మిదేళ్లలో ఎంతో చేశాం. అమృతకాలంలో మరింత బలమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి- రాబోయే కాలంలో మరింత చేయాలనుకుంటున్నాం. ప్రజా జీవితాల్లో మార్పులకు ఎన్డీయే సర్కారు విశేషంగా కృషి చేసింది. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో జీవితాలు మెరుగుపడ్డాయి'' అని మోడీ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)