కల్తీ అల్లం పేస్ట్‌ తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో అల్లం పేస్ట్‌ను కల్తీ చేస్తున్న ఇద్దరు నిర్వాహకుల్ని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో ఓ డెన్‌లో తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ అపరిశుభ్ర వాతావరణం,  మురుగునీటి వినియోగం.. ప్రమాదకరమైన కెమికల్స్‌తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతి లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నారు. కల్తీ అల్లాన్ని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపి మార్కెట్‌కు తరలిస్తున్నారు. మొత్తం 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్‌, 200 లీటర్ల అసిటిక్ యాసిడ్‌, 550 కేజీల నాన్‌ వెజ్ మసాల ప్యాకెట్లను సీజ్ చేసి, ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)