చెన్నై మెట్రోలో స్టూడెంట్స్కు మంత్లీ పాస్ !

Telugu Lo Computer
0


చెన్నై మెట్రో రైళ్లలో ప్రయాణించే స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా పాస్ లు ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్ణయించింది. బస్సులు, రైళ్ల తరహాలోనే మెట్రోలోనూ నెలవారీ పాస్ లు అదించనున్నట్లు ప్రకటించింది. చెన్నై మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు సగటున 2 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్యాసింజర్ల కోసం చెన్నై మెట్రో రైల్ ఇప్పటికే అనేక రాయితీలు అందిస్తోంది. రోజంతా ప్రయాణించేందుకు రూ.100 టిక్కెట్టు, నెలంతా ప్రయాణించేందుకు రూ. 2500కు మంత్లీ పాస్, గ్రూపుగా జర్నీ చేసే వారికి ఛార్జీల తగ్గింపు తదితర రాయితీలు ఇస్తోంది. నెలవారీ పాస్ కోసం రూ.2500 చెల్లించాల్సి రావడంతో కాలేజీ విద్యార్థులు తమకోసం తక్కువ ధరకే పాస్ జారీ చేయాలని కొంత కాలంగా కోరుతున్నారు. ఈ అంశంపై చెన్నై మెట్రో ఓ అధ్యయనం నిర్వహించగా రోజువారీ ప్యాసింజర్లలో 40 శాతం స్టూడెంట్సేనని తేలింది. మిగిలిన 60 శాతంలో 47 శాతం మంది ఉద్యోగులు, 13 శాతం మంది ఇతర ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థుల సౌకర్యార్థం రాయితీపై స్టూడెంట్స్ పాస్ అందుబాటులోకి తేవాలని చెన్నై మెట్రో రైల్ నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)