విడిపోతారనుకున్న దంపతులు తిరిగి ఒకటయ్యారు !

Telugu Lo Computer
0


మధ్య ప్రదేశ్ లోని గోపాల్ గంజ్ ప్రాంతంలోని సోను, వర్ష దంపతులకు 2017 లో పెళ్లి జరిగింది. సోను ప్రైవేటు టీచర్. అయితే మూడేళ్ల క్రితం కరోనా సమయంలో ఇంటి నుంచి పని చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పనుల విషయంలో అనేక గొడవలు జరిగాయి. ఇద్దరు ఏమాత్రం తగ్గక పోవడంతో గొడవలు కాస్త తారస్థాయికి చేరాయి. ఇక లాభం లేదని వర్ష తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. అయితే.. ఎన్నిసార్లు సోను మాట్లాడానికి ప్రయత్నించిన వర్ష మంకుపట్టు విడవలేదు. దీంతో చేసేది లేక ఇద్దరు డైవర్స్ తీసుకొవడానికి సిద్దపడ్డారు. దీంతో ఏడాది క్రితం మ్యూచ్ వల్ డైవర్స్ కు ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసుకున్నారు. కోర్టు వీరికి అనేక పర్యాయాలు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయితే.. వీరిలో ఆలోచనల్లో క్రమంగా మార్పులు రావడం ప్రారంభమైంది. కేవలం అపార్థాల వలన నూరెళ్ల జీవితాన్ని డైవర్స్ తీసుకుని విడిపోవద్దని నిర్ణయించుకున్నారు. లోక్ అదాలత్ లో న్యాయమూర్తి కూడా వీరికి ప్రత్యేకంగా దాంపత్య బంధం గురించి స్పెషల్ గా కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఇద్దరు కూడా తమ మనసు మార్చుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఫ్యామిలో కోర్టులో చివరి కౌన్సిలింగ్ సెషన్ సమయంలో జడ్జీ, ఇరువురి కుటుంబ సభ్యుల ముందు తిరిగి కలిసి ఉంటామని, కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా అందరి ముందు మరోసారి దండాలు కూడా మార్చుకున్నారు. దీంతో విడిపోతుందనుకున్నన దంపతులు తిరిగి ఒక్కటవ్వడంతో అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు శభాష్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)