అగ్ని ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

అగ్ని ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనం


బీహార్ లోని ముజఫర్‌పూర్‌ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌దయాలు స్లమ్ ఏరియాలోని ఓ ఇంట్లో అర్థరాత్రి సడన్ గా మంటలు చెలరేగాయి. ఆ దావాలనం పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించింది. తప్పించుకునే అవకాశం లేకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నరేష్‌రామ్‌కు చెందిన నలుగురు కుమార్తెలు మృత్యువాత పడ్డారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఇళ్లలోని సామాగ్రి మెుత్తం అగ్నికి అహూతైంది. అదే సమయంలో రాజేష్ రామ్, ముఖేష్ రామ్ ఇళ్లలో కూడా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురికి మంటలకు అంటుకున్నాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మంటలు ఎలా చెలరేగాయో అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment