జూన్‌ 1 నుంచి రాష్ట్రపతి భవన్‌ లో సందర్శకులకు ప్రవేశం !

Telugu Lo Computer
0


రాష్ట్రపతి భవన్‌ను జూన్‌ 1వ తేదీ నుంచి వారానికి 6 రోజులపాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఆదివారం వరకూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఏడు స్లాట్లలో సందర్శనకు అనుమతిస్తామని వెల్లడించాయి. ప్రకటిత ప్రభుత్వ సెలవు దినాల్లో అనుమతించబోమని పేర్కొన్నాయి. ప్రస్తుతం వారానికి 5 రోజులే సందర్శకులను అనుమతిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)