సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

Telugu Lo Computer
0


సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫలితాల్లో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.91 శాతం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయాగ్‌రాజ్‌ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)