బెంగాల్లో మళ్లీ చెలరేగిన హింస

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నగరంలో హింసాత్మక ఘటనలు మరోసారి తెరపైకి వచ్చాయి. రిష్రాలో రైల్వేస్టేషన్ లో కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దీంతో రైల్వే స్టేషన్ను మూసివేశారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనాస్థలంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. సోమవారం అర్థరాత్రి రిష్రాలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. రిష్రా రైల్వే స్టేషన్లోని గేట్ నెంబర్ 4 ముందు రాళ్ల దాడి జరిగిందని, దీని కారణంగా హౌరా బర్దమాన్ మెయిన్ లైన్లో రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో హౌరా స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు పెద్దెత్తున ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ప్రయాణీకుల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని రైళ్లను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేట్టినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)